అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

by  |
man-death
X

దిశ, శంకర్‌పల్లి: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిలా గ్రామంలోని దుర్గా వైన్స్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద గల కొత్త మిట్ట గ్రామానికి చెందిన సజ్జనోళ్ళ మునియప్ప(30) శుక్రవారం ఉదయం మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి పర్మిట్‌రూమ్ లోకి వెళ్లి మద్యం తాగినట్లు సమాచారం. అయితే ఉదయం గోపులారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి పర్మిట్ రూమ్ లో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు దుకాణం నిర్వాహకులు తెలిపారు. దుకాణ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్‌పల్లి సిఐ మహేష్ గౌడ్ తెలిపారు.

Next Story

Most Viewed