దోస్త్ దరఖాస్తుల గడువు పెంపు….

by  |
దోస్త్ దరఖాస్తుల గడువు పెంపు….
X

దిశ వెబ్ డెస్క్:
డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండవ విడత దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 27వరకు పొడగిస్తున్నట్టు కన్వీనర్ లింబాద్రీ తెలిపారు. ఈ రోజు వరకు78వేల 550 మందికి సీట్ల కేటాయించినట్టు అధికారులు తెలిపారు.

మొదటి దశలో లక్షా నలభై వేలమందికి డిగ్రీ సీట్లు కేటాయించారు. కేటాయింపుల తర్వాత 2లక్షల 60వేల సీట్లు మిగిలినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం రెండో విడతలో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 21 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed