దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు..

by  |
దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : దోస్తు దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొదటి విడత దరఖాస్తు గడువు ఈ నెల 15వ తేదీతో ముగియడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. లేట్ ఫీజ్ లేకుండా ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. సీట్ల కేటాయింపులను ఈ నెల 31న ప్రకటిస్తామని అన్నారు. విద్యార్థులు సీట్ల కోసం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ను ఆగస్ట్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇవ్వాలని సూచించారు. రెండవ విడత దరఖాస్తులకు ఆగస్ట్ 1 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు దోస్త్‌లో 1,17,601 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిపారు.


Next Story

Most Viewed