వరద పేరుతో రాజకీయం చేసే వారిని నమ్మొద్దు

by  |
వరద పేరుతో రాజకీయం చేసే వారిని నమ్మొద్దు
X

దిశ, ముషీరాబాద్:
వరద పేరుతో రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాంనగర్ డివిజన్ సంజయ్ నగర్‌లో గోడ కూలి మరణించిన చిన్నారి జయశ్రీ కుటుంబాన్ని మంత్రి తలసాని, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ శనివారం పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జయశ్రీ తండ్రి జయక్రిష్ణకు ఎమ్మల్యే ముఠా గోపాల్ ల చేతుల మీదుగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లడుతూ…. గత పాలకులు చేసిన పాపాలను తమ ప్రభుత్వం మోయాల్సి వస్తోందని చెప్పారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చింది అప్పటి ప్రభుత్వాలేనని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అడగా ఉంటుందని తెలిపారు.


Next Story

Most Viewed