నిర్లక్ష్యంగా ఉండొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by  |
నిర్లక్ష్యంగా ఉండొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, రంగారెడ్డి: మున్సిపాలిటీ పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శంకరపల్లి మున్సిపాలిటీలో పారిశుధ్య అవసరాలకై కొనుగోలు చేసిన ట్రాక్టర్లను శుక్రవారం మంత్రి సబితా ఇంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో పట్టణ ప్రగతి ప్రారంభం కాబోతోందని అన్నారు. వచ్చే వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాధులను తరిమికొట్టేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శంకరపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ వెంకట్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed