నామినేషన్ దాఖలు చేసిన డొక్కా

by  |
నామినేషన్ దాఖలు చేసిన డొక్కా
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. మార్చి9న ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. దీంతో ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే క్రమంలో వైసీపీలో చేరిన డొక్కాకే మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో ఇవాళ ఆయన నామినేషన్ ధాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బలకృష్ణమాచార్యులుకు నామినేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ నందిగం సురేశ్ ఉన్నారు.



Next Story