- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాజస్థాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భరత్పూర్ నగరంలోని ఓ జంక్షన్ వద్ద డాక్టర్ల దంపతులను బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. భరత్పూర్ జిల్లా హెడ్క్వార్టర్స్లోని సెంట్రల్బస్టాండ్ సర్కిల్ వద్ద.. బైక్పై వచ్చిన ఇద్దరు నిందితులు డాక్టర్ దంపతుల కారును అడ్డగించి.. వారిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ బైక్పై పరారయ్యారు. మృతులను డాక్టర్ సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిపై కాల్పులు జరిపిన వారిని అనుజ్, మహేష్లుగా గుర్తించిన పోలీసు అధికారులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నట్టు తెలిపారు.
Next Story