షాకింగ్.. పట్టపగలే నడి రోడ్డుపై డాక్టర్ల దంపతుల దారుణ హత్య

by  |
షాకింగ్.. పట్టపగలే నడి రోడ్డుపై డాక్టర్ల దంపతుల దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భరత్‌పూర్ నగరంలోని ఓ జంక్షన్ వద్ద డాక్టర్ల దంపతులను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. భరత్‌పూర్ జిల్లా హెడ్​క్వార్టర్స్‌లోని సెంట్రల్​బస్టాండ్ సర్కిల్ వద్ద.. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు డాక్టర్ దంపతుల కారును అడ్డగించి.. వారిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.

దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. మృతులను డాక్టర్ సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిపై కాల్పులు జరిపిన వారిని అనుజ్, మహేష్‌లుగా గుర్తించిన పోలీసు అధికారులు.. ఇది ప్రతీకార హత్యలేనని భావిస్తున్నట్టు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed