టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దు

by  |
Somu veerraju
X

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై రాజకీయంగా దుమారం రేపింది. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించగా…పెడితే సహించేది లేదని బీజేపీ నేతలు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అయితే ప్రొద్దుటూరు వెళ్లి మరీ ఆందోళన చేశారు.

అయితే ఈ అంశంపై తాజాగా జిల్లా కలెక్టర్ స్పందించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని సోము వీర్రాజు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎమ్మెల్యే రాచమల్లు ప్రయత్నించారని అన్నారు. అయితే ఆయన కుట్రలను బీజేపీ నేతలు, హిందువులు భగ్నం చేశారన్నారు. ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని వీర్రాజు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed