టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ కృష్ణయ్య

by  |
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ కృష్ణయ్య
X

దిశ, లింగాల: దీపావళి సందర్భంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలని లింగాల మండల ప్రజలకు ఎస్ఐ కృష్ణయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రజలందరూ దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చూసుకోవాలన్నారు. టపాసులు అమ్మే దుకాణదారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని, చిన్నపిల్లలను టపాసులు పేల్చి సమయంలో దగ్గర వెళ్లకుండా చూడాలని సూచించారు. గడ్డివాములు దగ్గరలో టపాకాయలు కాల్చవద్దని సూచించారు. రాత్రి 10 తర్వాత టపాసులు కాల్చ వద్దని 10 తర్వాత కాల్చిన వారి పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే 100కు కాల్ చేయమని ప్రజలకు తెలిపారు.

Next Story

Most Viewed