కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

by  |
కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్(62) బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన చేప్పాక్కం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2001, 2011, 2016 లో కూడా అన్బళగన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత కరుణానిధి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు అన్బళగన్ సన్నిహితంగా ఉండేవారని సమాచారం.

Next Story

Most Viewed