ప్రచారంలో పాల్గొన్న ఎంపీకి కరోనా.. టెన్షన్‌లో నేతలు, కార్యకర్తలు

by  |
ప్రచారంలో పాల్గొన్న ఎంపీకి కరోనా.. టెన్షన్‌లో నేతలు, కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పలువురు రాజకీయ నేతలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా డీఎంకే నేత, లోక్​సభ ఎంపీ కనిమొళికి కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా​ నిర్ధారణ అయిన వెంటనే ఆమె చెన్నై సీఐటీ కాలనీలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు.

అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె డీఎంకే తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు. డీఎంకే స్టార్​ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమె గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె కరోనాబారినపడటంతో ఆమెతో ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.


Next Story