DGP మహేందర్ రెడ్డి.. TRS శవయాత్రలు కనిపించడం లేదా : డీకే అరుణ ఫైర్

by Shyam |
DGP మహేందర్ రెడ్డి.. TRS శవయాత్రలు కనిపించడం లేదా : డీకే అరుణ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు పిలుపునిస్తే వారిని ముందస్తు అరెస్టులు చేసి వారిని ఇబ్బందులకు గురి చేసే పోలీసులు.. టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రధాని మోడీ శవయాత్రలు చేస్తుంటే డీజీపీ మహేందర్ రెడ్డికి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.

బీజేపీ నేతలను అరెస్ట్​చేస్తారు కానీ.. టీఆర్ఎస్​నేతలను ఎందుకు అరెస్ట్​చేయరని అరుణ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బీజేపీ అధిష్టానం నుంచి ఆదివారం రాత్రి ఫోన్​రావడంతో ఆమె సోమవారం ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మంగళవారం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed