జోగులాంబ గద్వాల జిల్లాకు డాక్టర్లను రప్పించండి: డీకే అరుణ

by Shyam |

<p>దిశ, మహబూబ్‎నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక వైద్యులను నియమించాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ మంత్రి డి.కె.అరుణ కోరారు. శుక్రవారం వైద్యఆరోగ్య శాఖ మంత్రితో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కొందరు డాక్టర్లు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారన్నారు. దీంతో డాక్టర్ల కొరత రావొచ్చని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రత్యేకంగా డాక్టర్లను నియమిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని మంత్రి ఈటల [&hellip;]</p>

జోగులాంబ గద్వాల జిల్లాకు డాక్టర్లను రప్పించండి: డీకే అరుణ
X

దిశ, మహబూబ్‎నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక వైద్యులను నియమించాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ మంత్రి డి.కె.అరుణ కోరారు. శుక్రవారం వైద్యఆరోగ్య శాఖ మంత్రితో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కొందరు డాక్టర్లు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారన్నారు. దీంతో డాక్టర్ల కొరత రావొచ్చని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రత్యేకంగా డాక్టర్లను నియమిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని మంత్రి ఈటల రాజేందర్‌కు అరుణ వివరించారు.

Tags: DK Aruna, phone, etela rajender, doctors, coronavirus, Jogulamba Gadwal

Next Story