డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: డీకే అరుణ

by  |
డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: డీకే అరుణ
X

దిశ, జడ్చర్ల : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకోసం పురపాలక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పిలుపునిచ్చారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్చల మండలంలోని పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు అరుణ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని.. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చూసి తట్టుకోలేకనే.. వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకున్నారని ఆరోపించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు ఎన్నికలు జరపడం ప్రజల ప్రాణాలతో చెలగాటమని అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed