- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, సినీనటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని మాట తీరు, ప్రవర్తన, నడవడిక చూస్తుంటే పిచ్చిపట్టిందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. లోకేశ్ మాటతీరు, తెగువ చూశాక నానికి మతిపోయినట్టుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్లను బూతులు తిడుతున్న నాని ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని హితవు పలికారు.
హూ కిల్డ్ బాబాయి, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా అని ఆమె ప్రశ్నించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ రాష్ట్రంలో తనకు రక్షణ లేదని పోలీసులను ఆశ్రయించడంపై నానీ ఏం చెబుతాడని నిలదీశారు. గతంలో చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన వారు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదన్నది నానికి తెలుసా అని ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి, అమరావతి భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నగొంతులు ఇప్పుడెందుకు మూగబోయాయో నాని చెప్పాలని దివ్యవాణి నిలదీశారు. తండ్రి వయసున్న చంద్రబాబుపై బూతులు తిట్టడం సరికాదని పద్ధతి మర్చుకోవాలని సూచించారు.