సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు

by  |
సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం దివ్య తేజస్విని తల్లిదండ్రులు కలిశారు. హోంమంత్రి సుచరిత దివ్య తల్లిదండ్రులను సీఎం జగన్‌ దగ్గరకు తీసుకెళ్లారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. దివ్య కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని దివ్య తల్లిదండ్రులు తెలిపారు. నిందితుడు నాగేంద్రబాబుపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తామని, సోషల్ మీడియాలో వేధింపులపై మహిళలు దైర్యంగా ఫిర్యాదు చేయాలని హోంమంత్రి సుచరిత తెలిపారు.


Next Story

Most Viewed