అప్పటి వరకు దివిస్ ఒక్క ఇటుక పెట్టదు: మంత్రి గౌతమ్

by  |
అప్పటి వరకు దివిస్ ఒక్క ఇటుక పెట్టదు: మంత్రి గౌతమ్
X

దిశ,వెబ్ డెస్క్: ప్రజల సందేహాల నివృత్తి జరిగే వరకూ దివిస్ ఒక్క ఇటుక కూడా పెట్టదని మంత్రి మేకపాటి గౌతమ్ పేర్కొన్నారు. దివిస్ యాజమాన్యంతో శనివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు, మత్స్యకారులు, స్థానిక ఆందోళనలకు గల కారణాలను దివిస్ యాజమాన్యంతో మంత్రి చర్చించారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వాటికి ప్రత్యామ్నాయాలుచ పరిష్కారాలకు మంత్రి చొరవ చూపారు. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాకే దివిస్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తామని అన్నారు.

Next Story

Most Viewed