ఆదర్శ వివాహం చేసుకున్న జెడ్పీ వైస్ చైర్ పర్సన్

by  |
ఆదర్శ వివాహం చేసుకున్న జెడ్పీ వైస్ చైర్ పర్సన్
X

దిశ, వరంగల్: ఆమె ఒక ప్రజాప్రతినిధి.. నేడు ఆమె వివాహం చేసుకున్నారు. ఆ వివాహ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. విషయం తెలిసిన జిల్లా వాసులు ప్రశంసలు కురిపిస్తూ ఆ నూతన దంపతులకు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. విషయమేమిటంటే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో తన స్వగృహంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ఆదర్శ వివాహం చేసుకున్నారు. కొవిడ్-19 నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆదర్శ వివాహం చేసుకున్న నాగజ్యోతి-జగదీశ్ దంపతులను పదుల సంఖ్యలో హాజరైన బంధుమిత్రులు ఆశీర్వదించారు. లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమక్షంలో పెళ్లి చేసుకున్న వైస్ చైర్మన్ బడే నాగజ్యోతిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల హరిబాబు, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామూర్తి, తాడ్వాయి ఎంపీడీవో సాదుల ప్రసాద్, కాకులమర్రి ప్రదీప్ బాబు శివాలయం కమిటీ చైర్మన్ తాడూరి రఘు, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed