టీఎన్జీవో ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

by  |
టీఎన్జీవో ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
X

దిశ, హైదరాబాద్: టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు హుస్సేనీ ఆధ్వర్యంలో 513 మంది సిబ్బందికి శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, కారం రవీందర్‌రెడ్డి నిత్యావసరాలను అందజేశారు. అనంతరం టి. ప్రతాప్ రచించిన పాటను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మామిళ్ల రాజేందర్, రేచల్, ఎస్. ఉమాదేవి, ప్రభాకర్, బాలరాజ్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, సివిల్ సర్జన్ డాక్టర్ సాయి శోభ, ఆర్ఎంఓ డాక్టర్ రఫీ పాల్గొన్నారు.


Next Story

Most Viewed