వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

by  |

దిశ, మేడ్చల్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించారు. కరోనాను నివారించేందుకు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ, పరిశ్రమ కార్మికులు సుమారు 5 వేల మందికి.. 10 కిలోల బియ్యం, నూనె, చింతపండు అందించారు. సంస్థ ఛైర్మన్​ కొమురయ్య పిలుపు మేరకు స్కూలు అడ్మినిస్టేటివ్​ ఆఫీసర్ సరిత, రాబిన్​, తదితర సిబ్బంది ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు సూచించారు.

Tags: Distribution, Essential Commodities, Migrant Workers, Delhi Public School, nacharam

Next Story

Most Viewed