60.58లక్షల మందికి రైతుబంధు సాయం పంపిణీ

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు పథకం ద్వారా ఇప్పటి వరకు 60.58 లక్షల మంది రైతులకు పంటపెట్టుబడి సాయాన్ని అందించామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 143.56 లక్షల ఎకరాలకు గాను రైతుల ఖాతాలలో రూ.7178.67 కోట్లు జమ చేశామని తెలిపారు.

బుధవారం 10.29 లక్షల ఎకరాలకు చెందిన 87 వేల మంది రైతుల ఖాతాలలో రూ.514.88 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63.25 లక్షల మంది రైతులుండగా వీరందరికి ప్రభుత్వం రైతు బంధు ద్వారా రూ.7,508.78 కోట్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఇంకా 2.67లక్షల మంది రైతులకు రూ. 329.33కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది.

Next Story

Most Viewed