ఐదు వేల కొవిడ్​ కిట్స్ పంపిణీ.. టెస్టుల అనంతరం అందజేత

by  |
ఐదు వేల కొవిడ్​ కిట్స్ పంపిణీ.. టెస్టుల అనంతరం అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ పరిధిలో కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నవారికి తొలి రోజు ఐదు వేల కొవిడ్ కిట్లను జీహెచ్ఎంసీ అందజేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్​కిట్స్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థను రూపొందించి అందజేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఇంటింటి ఫీవర్​సర్వే చేపడుతున్న అధికారులు కొవిడ్ కంట్రోల్​రూమ్‌కు వచ్చే విజ్ఞప్తులకు కూడా కొవిడ్​కిట్స్‌ను బల్దియా అధికారులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటి వద్దకే వెళ్లి కొవిడ్​కిట్స్‌ను అందిస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అధికారులు ఇంటింటి ఫీవర్​ సర్వే చేపట్టిన నేపథ్యంలో అవసరమైన వారికి అక్కడే కొవిడ్ కిట్లను అందిస్తున్నారు. ఈ నెల 4న 40 వేల ఇండ్లల్లో సర్వే చేస్తే 1,487 మంది కొవిడ్​లక్షణాలతో ఉన్నారని గుర్తించారు. వీరిలో 1,400 మందికి వెంటనే కోవిడ్ మందుల కిట్ అందజేశారు. మరో వైపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొవిడ్​ టెస్టులు చేస్తున్నారు. అక్కడ కొవిడ్ లక్షణాలు కనిపించినా వారికి కూడా కిట్స్​ అందజేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,600 మందికి కొవిడ్​నివారణ మందుల కిట్లను అందజేశారు. దీంతో మొత్తం ఐదు వేల మందికి జీహెచ్ఎంసీ కొవిడ్ కిట్లను జీహెచ్ఎంసీ అందజేసినట్లయింది.

కొవిడ్​ కంట్రోల్ రూం ద్వారా..

జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో నియమించిన వైద్యులు 250 కాల్స్‌ను తీసుకుని సలహాలు, సూచనలు అందించారు. ఐసోలేషన్‌లో ఉంటున్నవారు కొవిడ్ కిట్స్​కోసం కంట్రోల్​రూంను సంప్రదించవచ్చు. ఇచ్చిన వివరాల ఆధారంగా సర్కిల్​పరిధిలో నియమించిన సిబ్బంది ఇంటి వద్దకు చేరుకుంటారు. కొవిడ్ నిర్థారణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే కొవిడ్ కిట్లను అందిస్తారు. వీటిల్లో జ్వరం, యాంటీ బయోటిక్, శానిటైజర్, ఒక మాస్క్​అందజేస్తున్నారు. సంబంధిత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల సిబ్బందితో కరోనా నివారణ మందులతో కూడిన కిట్‌ను అందచేస్తున్నారు. డిప్యూటీ, జోనల్ కమిషనర్లు బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్​సెంటర్లలో జరుగుతున్న కొవిడ్ పరీక్షలను పరిశీలించడంతో పాటు కొవిడ్ కిట్ల అందజేతను మానిటరింగ్​చేస్తున్నారు.



Next Story