ఉచితంగా మాస్కుల పంపిణీ

by  |

దిశ‌, ఖ‌మ్మం: కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు ఖమ్మం నగరం సంభానీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీ సాయి మహిళా మండలి ప్రతినిధులు నడుం కట్టారు. మాస్కులను స్వయంగా తయారు చేసి, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, మీడియా ప్రతినిధులతో పాటు కాలనీలోని ప్రజలందరికీ ఇంటింటికి తిరుగుతూ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మహిళా మండలి ప్రతినిధులు ఝాన్సీ, విజయ దుర్గా, జాన్ బీ, దుర్గా, సత్యా, శ్రీదేవి, రేష్మా, సైదా, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Distribute, corona masks, free, khammam



Next Story

Most Viewed