రోడ్డు ప్రమాదంలో దిశ విలేఖరి మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో దిశ విలేఖరి మృతి
X

దిశ, కరీంనగర్ సిటీ: సీనియర్ జర్నలిస్ట్, హుజురాబాద్ దిశ డివిజన్ ఇంచార్జి పోలాటి లక్ష్మణ్ రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామం దండేపల్లికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. హుజురాబాద్ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆయనను అటుగా వెళ్తున్న వారు గుర్తించి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున లక్ష్మణ్ రావు మృతి చెందారు.

కాగా, జర్నలిస్టుగా హుజురాబాద్ ప్రాంతంలో సుపరిచితుడైన లక్ష్మణ్ రావు.. గతంలో పలు మీడియా సంస్థల్లో కూడా పని చేశారు. నిబద్ధత గల వ్యక్తిగా డివిజన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. దిశ దినపత్రిక ఆవిర్భావం నుంచి కొనసాగుతూ.. అనేక సామాజిక, రాజకీయ అంశాలు వెలుగులోకి తెచ్చారు. లక్ష్మణ్ రావు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.

Next Story

Most Viewed