- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ వైవిధ్యమున్న పాత్రలు పోషించేందుకే ఇంట్రెస్ట్ చూపుతోంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రంలో నటించిన భామ ప్రస్తుతం ‘ఏక్ విలన్ రిటర్న్స్’కు సిద్ధమవుతోంది. మోహిత్ సూరి డైరెక్షన్లో ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించిన ‘ఏక్ విలన్’ మూవీకి ఇది సీక్వెల్. 2014లో రిలీజైన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. రితేశ్ దేశ్ముఖ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. కాగా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా సీక్వెల్పై ప్రస్తుతం భారీ అంచనాలే నెలకొన్నాయి. దిశా పటానీ, జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సితారియా వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుండగా, ఈ థ్రిల్లర్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే షురూ అయిందని, తాను పాల్గొంటున్నానని తెలుపుతూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టింది దిశ. ‘ఏక్ విలన్ రిటర్న్స్’ అని రాసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. తాను యాక్షన్ సీక్వెన్సెస్లో పాల్గొనేందుకు ఎగ్జైటింగ్గా ఫీలవుతున్నానని తెలిపింది.