‘దిశ’ ఎఫెక్ట్.. కిట్లు విసిరింది ఎందుకు..?

by  |
‘దిశ’ ఎఫెక్ట్.. కిట్లు విసిరింది ఎందుకు..?
X

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: కరోనా కిట్లు విసిరేశారు అనే కథనం మంగళవారం ‘దిశ’లో ప్రచురణ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనగామ జిల్లా వైద్యాధికారి స్పందించి విచారణకు ఆదేశించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో పాజిటివ్ వచ్చినవారికి కరోనా కిట్లు చేతికి ఇవ్వకుండా రెండు మీటర్ల దూరంలో ఉన్న వారికి విసిరి వేయడాన్ని దిశలో ప్రచురించగా వైరల్‌‌గా మారింది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య జిల్లా వైద్యాధికారి వివరణ కోరగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ఓను విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.


Next Story