ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. షాక్‌లో ఇండస్ట్రీ

by  |
Director SP Jananathan
X

దిశ, సినిమా : నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఎస్‌పి జననాధన్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ హెమరేజ్(మెదడు రక్తస్రావం) కారణంగా ఇంట్లో స్పృహతప్పి పడిపోయిన జననాధన్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఫ్యామిలీ. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌కు స్పందించని దర్శకుడు.. ఆదివారం ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు.

2003లో ‘డ్రామా ఇయార్కయి’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా సినీకెరియర్ ప్రారంభించిన ఎస్‌పి జననాధన్ తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. ‘ఈ – ది బయో వార్, పెరాన్మై, పురంపొక్కు ఎంగిర పొదువుదమై’ చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘లాభం’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ఎడిటింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే బ్రెయిన్ హెమరేజ్‌తో ఆస్పత్రిలో చేరారు. ఎస్‌పి జననాధన్ మరణంతో దిగ్భ్రాంతికి గురైన కోలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story