మాలీవుడ్ డైరెక్టర్ మృతి.. ప్రముఖుల సంతాపం

by  |
మాలీవుడ్ డైరెక్టర్ మృతి.. ప్రముఖుల సంతాపం
X

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. మాలీవుడ్ డైరెక్టర్ కేఆర్ సచ్చిదానందన్ కన్నుమూశారు. హిప్ రీప్లేస్మెంట్ లో భాగంగా తొలి సర్జరీ సక్సెస్ అయినా.. రెండో సర్జరీ ఫెయిల్ కావడంతో గుండెపోటు, బ్రెయిన్ డామేజ్ అయిందని రెండు రోజుల క్రితం వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి చెన్నై ట్రిస్సూర్ లోని జూబిలీ హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం రాత్రి కన్నుమూశారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మారిన సాచి.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ, తమిళ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. అనార్కలి చిత్రం ద్వారా రచయితగా 2015 లో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. సేతునాత్ తో కలిసి పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. సాచి- సేతు కాంబినేషన్ కు మాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

కాగా సాచి మృతితో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మలయాళ ఇండస్ట్రీ టాలెంటెడ్ డైరెక్టర్ ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.



Next Story

Most Viewed