దర్శకులు నిషికాంత్ కమత్ ఇకలేరు

by  |   (  Updated:2020-08-17 02:14:49  IST  )

<p>ప్రముఖ దర్శకులు నిషికాంత్ కమత్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జూలై 31న జాయిన్ అయిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జాండిస్, ఉదర సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. కాగా నిషికాంత్ అజయ్ దేవగన్ &#8211; టబు నటించిన దృశ్యం, ఇర్ఫాన్ ఖాన్ మదారి, జాన్ అబ్రహం ఫోర్స్, [&hellip;]</p>

దర్శకులు నిషికాంత్ కమత్ ఇకలేరు
X

ప్రముఖ దర్శకులు నిషికాంత్ కమత్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జూలై 31న జాయిన్ అయిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జాండిస్, ఉదర సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు.

కాగా నిషికాంత్ అజయ్ దేవగన్ – టబు నటించిన దృశ్యం, ఇర్ఫాన్ ఖాన్ మదారి, జాన్ అబ్రహం ఫోర్స్, రాకీ హ్యాండ్ సమ్ లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేశారు. గతంలో లివర్ సిరోసిస్ తో పోరాడిన ఆయన .. ఇప్పుడు మళ్లీ అదే వ్యాధితో బాధపడ్డాడు అని చెబుతున్నారు వైద్యులు.

కాగా ఉదయం 10:30 నిమిషాల సమయంలో నిశికాంత్ కమత్ కన్నుమూసినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ వార్తతో షాక్ గురైన సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story