పవన్ పర్మిషన్‌తోనే పక్కన పెట్టా : క్రిష్

by  |
పవన్ పర్మిషన్‌తోనే పక్కన పెట్టా : క్రిష్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్నాడు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి కావడంతో మిగిలిన భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రావాల్సిన పాన్ ఇండియా సినిమాను పక్కన పెట్టి, వకీల్ సాబ్ అనంతరం వెంటనే ములయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆగిపోయిందా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. దీంతో డైరెక్టర్ క్రిష్ స్పందించాడు. పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే సినిమాను పక్కన పెట్టానని, ఆ గ్యాప్‌లో వైష్ణవ్ తేజ్‌తో పూర్తి చేశానని తెలిపాడు. అంతేగాకుండా పవన్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతామనేది త్వరలో వెల్లడిస్తామని వివరించారు.

Next Story