‘దృశ్యం-3’ రూమర్స్‌పై డైరెక్టర్ క్లారిటీ

by  |
‘దృశ్యం-3’ రూమర్స్‌పై డైరెక్టర్ క్లారిటీ
X

దిశ, సినిమా : జీతు జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్‌లాల్, మీనా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం’. ఈ చిత్రం సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీలోనూ సూపర్ హిట్ కాగా, తాజాగా అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’పై వార్తలొస్తుండగా, ఇందుకోసం డైరెక్టర్ జీతు జోసెఫ్ బయటి రచయితల నుంచి కథ తీసుకుంటారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా వీటిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ జీతు. సోషల్ మీడియాలో వచ్చేవన్ని వదంతులేనని, వాటిని నమ్మి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న మెయిల్ ఐడీకి స్టోరీ పంపొద్దని జీతు జోసెఫ్ కోరారు. దృశ్యం పార్ట్ 3 కోసం బయట రచయితల నుంచి కథలు ఆహ్వానించలేదని, తానే క్లైమాక్స్ రాశానని, అయితే కథ ఎక్స్‌టెండ్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతుందని వివరించారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కనున్న ‘దృశ్యం-2’కు జీతునే దర్శకత్వం వహించనున్నారు.

Next Story

Most Viewed