కియారా, సిద్ధార్థ్‌ల రొమాన్స్‌తో సంబంధం లేదు : డైరెక్టర్

by  |
kiara siddartha
X

దిశ, సినిమా : బాలీవుడ్ రూమర్డ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఫస్ట్ టైమ్ ‘షేర్షా’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ విష్ణు వర్ధన్.. వారి మధ్య ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ గురించి తానెప్పుడూ పట్టించుకోలేదన్నారు. వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి రియల్ రొమాన్స్‌తో పనిలేదన్న ఆయన.. ఈ జోడీ సినిమాలో ఎలా కనిపించిందనేదే తనకు ఇంపార్టెంట్ అని చెప్పారు.

వారి స్క్రీన్ అప్పియరెన్స్ ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందని, తప్పకుండా ఎంజాయ్ చేస్తారని వివరించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్.. మూవీ క్యారెక్టర్స్‌కు చాలా క్లోజ్‌గా ఉంటుందని చెప్పారు. కార్గిల్ వార్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా, డింపుల్ చీమా జీవితాలను తెరపై ఆవిష్కరించనుండగా, 90వ దశకంలో సెట్ చేయబడిన కథలో సిద్ధార్థ్, కియారాల ఇన్నోసెన్స్, రొమాన్స్ తెరపై అద్భుతంగా ఉండబోతుందన్నారు డైరెక్టర్ విష్ణు వర్ధన్.



Next Story

Most Viewed