‘మహిళల ఫిగర్ 8 అంకెలా ఉండాలి.. పీపాలా కాదు’

by  |
‘మహిళల ఫిగర్ 8 అంకెలా ఉండాలి.. పీపాలా కాదు’
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో డీఎంకే తరుపున బరిలోకి దిగిన దిండిగల్ ఐ లియోనీ కోయంబత్తూరు ర్యాలీలో మహిళల శరీర ఆకృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళలు తమ శరీర ఆకృతిని కోల్పోతున్నారని, విదేశీ ఆవుల పాలు తాగడం వల్ల బరువు పెరిగిపోయి బెలూన్‌లా తయారవుతున్నారు. గతంలో మహిళల ఫిగర్ 8 అంకెలా ఉండేది. కానీ వారిప్పుడు పీపాల్లా తయారయ్యారు. మన పిల్లలు కూడా లావైపోతున్నారు’’ అని అన్నారు.
లియోనీ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. లియోనీపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ మహిళా నేత, ఎంపీ కనిమొళిని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed