‘డిజిటల్ ఇండియా ఓ లైఫ్ స్టైల్: మోదీ

by  |
‘డిజిటల్ ఇండియా ఓ లైఫ్ స్టైల్: మోదీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రకటించిన ‘డిజిటల్ ఇండియా’ మిషన్ సర్కారు కార్యక్రమంగానే మిగిలిపోలేదని, నేడు అదొక లైఫ్ స్టైల్‌గా పరిణమించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గురువారం బెంగళూరులో టెక్ సదస్సు 2020ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ‘డిజిటల్ ఇండియా మనదేశంలో మనిషి కేంద్రకంగా అభివృద్ధి చెందుతున్నది. దేశ పౌరుల జీవితాల్లో టెక్నాలజీ అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రతిఒక్కరూ టెక్ ఫలితాలు అనుభవిస్తున్నారు. డిజిటల్, టెక్ సొల్యూషన్స్‌కు మార్కెట్‌ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైంది. టెక్నాలజీ ఫస్ట్ రూపంలోనే ప్రభుత్వ మాడల్ ఉన్నది’ అని వివరించారు.

కరోనా మహమ్మారి కాలంలో సాంకేతికత ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. లాక్‌డౌన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ టెక్నాలజీ సహాయంతోనే సకాలంలో సహకారం అందించగలిగామని తెలిపారు. పారిశ్రామిక శకం నుంచి సమాచార శకానికి మధ్య మార్పులను వివరిస్తూ, ‘పారిశ్రామిక విజయాలు గతకాలపు అనుభవాలను మనముందుంచుతాయి. ప్రస్తుతం మనం సమాచార శకం మధ్యలో ఉన్నాం. కానీ, భవిష్యత్ మనం ఊహించినదాని కన్నా వేగంగా దూసుకొస్తున్నది. పారిశ్రామిక శకంలో మార్పులు క్రమపద్ధతిగా జరిగేవి. సమాచారంలో అలా ఉండబోదు. అప్పుడు ముందుగా కొత్తపథాన్ని తొక్కినవారు ముందుండేవారు. కానీ, ఇప్పుడు కాస్త వెనుకాముందైనా ఉత్తములే అగ్రశ్రేణిలో ఉంటారు’ అని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed