స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫోన్‌కు వేగంగా స్పందించాలి : డీఐజీ

by  |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ: నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించేలా పోలీసు అధికారులంతా కృషి చేయాలని డీఐజీ రంగనాథ్ సూచించారు. గురువారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయాలని, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని చెప్పారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్‌ను అన్ని స్థాయిల పోలీసు అధికారులు అమలయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఫంక్షనల్ వర్టీకల్స్ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. వర్టీకల్స్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఆన్‌లైన్ నమోదులో రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమని వెల్లడించారు.

ఫిర్యాదుదారులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా స్థానిక పోలీసుల పనితీరును జిల్లా స్థాయిలో పరిశీలించడం జరుగుతోందని అన్నారు. 14 రకాల వర్టీకల్స్ విషయంలో ప్రతీ పోలీస్ అధికారి శ్రద్ధ వహించాలని సూచించారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్‌కు విధిగా స్పందించడంతో పాటు సాధ్యమైనంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకొని, పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం పెంచేలా కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో కోర్టు కానిస్టేబుల్స్ పనితీరు మెరుగు పర్చుకుంటూ శిక్షల శాతం పెరిగేలా చేయడం ద్వారా డిపార్ట్‌మెంట్‌పై గౌరవం మరింత పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో విధి నిర్వహణలో మరింత బాధ్యతాయుతంగా పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. అనంతరం సమర్ధవంతమైన సేవలందించిన పోలీసులను డీఐజీ రంగనాథ్ అభినందించి, పతకాలు అందజేశారు.

డీఐజీకి కృతజ్ఞతలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం

జిల్లా పోలీసు శాఖలోని ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు జరిగేలా అన్ని చర్యలు తీసుకొని, జులై నెల నూతన పీఆర్సీతో కూడిన వేతనం ఉద్యోగుల అకౌంట్లలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్న సందర్భంగా పోలీస్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.జయరాజ్, నాయకులు సోమయ్య రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రవీందర్, రమణా రెడ్డి, సురేష్ కుమార్, సీఐలు బాలగోపాల్, చంద్ర శేఖర్ రెడ్డి, నిగిడాల సురేష్, పీఎస్డీ ప్రసాద్, ఆదిరెడ్డి, సత్యం, నాగరాజు, సత్యనారాయణ, గౌరు నాయుడు, శంకర్ రెడ్డి, రాఘవులు, వెంకటేశ్వర్లు, రౌతు గోపి, రవీందర్, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణారావులతో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed