భేటీలో పార్టీలు ఏమన్నాయంటే….

by  |
భేటీలో పార్టీలు ఏమన్నాయంటే….
X

దిశ, వెబ్ డెస్క్:
రాజకీయ పార్టీలతో ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు పార్టీలు తమ అభిప్రాయలను, సూచనలను వెల్లడించాయి. ఏపీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదని సీపీఎం పార్టీ తెలిపింది. ఎన్నికలు వాయిదా వేసినప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయనీ సీపీఎం తెలిపింది. రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈసీ ముందుకు వెళ్లాలనీ ఆ పార్టీ సూచించింది. వివాదాలకు తావు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం సూచించింది. కాగా తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ను ఇవ్వాలని బీజేపీ కోరింది. గత ఏక గ్రీవాలను రద్దు చేయాలని బీజేపీ చెప్పింది. ఇక గత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈసీకి తెలిపినట్టు బీఎస్పీ పార్టీ చెప్పింది. వెంటనే ఎన్నికలను నిర్వహించాలనీ కోరినట్టు బీఎస్పీ తెలిపింది.


Next Story