జాలర్లు షాక్.. ధూళికట్ట చెరువులో చిక్కిన వింత చేప

by  |
జాలర్లు షాక్.. ధూళికట్ట చెరువులో చిక్కిన వింత చేప
X

దిశ , పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో వింత చేప జాలర్లకు చిక్కింది. జిల్లాలోని ఎలిగేడు మండలం ధూళికట్ట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానిక యువకులకు వింత చేప దొరికింది. చుంచు హరీష్, నెల్లి కుమారులకు ఈ చేప లభించిందని, అంతేకాకుండా చేప వివిధ రకాల శబ్దాలు చేస్తుందని వారు తెలిపారు. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో గోల్డ్ ఫిష్ లభ్యమైంది. ఏదిఏమైనా వింత చేప దొరకడంతో దానిని చూసేందుకు ప్రజలు ఎక్కువగా తరలివస్తున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed