కేజ్రీవాల్‌కు దీదీ లేఖ.. అందులో ఏం ఉన్నదంటే..?

by  |
కేజ్రీవాల్‌కు దీదీ లేఖ.. అందులో ఏం ఉన్నదంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీలకు తాను లేఖలు రాస్తారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనం చేసేందుకే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొస్తున్నారని అన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలను కల్పించి, ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయనకు సబార్డినేట్‌లా తయారు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోయినా వారికి చెందిన మరో ప్రతినిధి (లెఫ్టినెంట్ గవర్నర్)చేత ఢిల్లీని పాలించడానికి పన్నాగం పన్నుతున్నారని దుయ్యబట్టారు.

అయితే కేజ్రీవాల్ కు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని మమత తెలిపారు. మీ పోరాటమే నా పోరాటం కూడా. మీరు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనం చేస్తూ, వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లు 2021ని సమాఖ్య వ్యవస్థపై సర్జికల్ స్ట్రయిక్ గా అభివర్ణించారు. తను చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు.

Next Story

Most Viewed