- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు సమస్యల గురించి సోషల్ మీడియా హ్యాండిల్స్లో చర్చిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుంది కూడా. కాగా ఆప్ఘనిస్తాన్ సంక్షోభం గురించి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో ఎదుర్కొన్న ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ ముప్పు గురించి తాజాగా తెలిపింది. చైనాకు సంబంధించిన వారు తన ఎకౌంట్ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. దీన్ని అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించిన కంగన.. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తాలిబాన్ సమస్యకు సంబంధించిన పోస్ట్లన్నీ అదృశ్యమయ్యాయని చెప్పింది. లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా పదే పదే లాగ్అవుట్ అవుతుందని తెలిపిన ఆమె.. ఈ విషయాన్ని షేర్ చేసేందుకు తన సిస్టర్ రంగోలి చందేల్ మొబైల్ యూజ్ చేసినట్లు వెల్లడించింది. కాగా, గతంలో ఎన్నికల్లో హింస గురించి వరుస ట్వీట్లు చేయగా.. కంగనాను ట్విట్టర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.