కర్నూలులో వ్యవసాయ కూలీకి దొరికిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా.?

by  |
కర్నూలులో వ్యవసాయ కూలీకి దొరికిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో మరో వజ్రం లభించింది. ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. ఈ క్రమంలో వజ్రం దొరికిన సదురు కూలీ.. ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి రూ. 6 లక్షలకు అమ్మినట్టు సమాచారం. అయితే ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 18 లక్షలు ఉంటుందని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed