హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్

by  |
హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ దియా మీర్జా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఫిబ్రవరిలో వ్యాపారవేత్త వైభవ్ రేఖిని రెండో పెళ్లి చేసుకున్న దియా.. తనతో కలిసి మాల్దీవ్స్‌‌లో హ్యాపీగా గడుపుతోంది. పెళ్లి చేసుకున్న 11ఏళ్ల తర్వాత 2019లో మొదటి భర్త సాహిల్ సంఘకు విడాకులిచ్చిన భామ.. రెండు సంవత్సరాల ఒంటరితనానికి చెక్ పెడుతూ సెకండ్ మ్యారేజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ‘ప్రస్తుతం న్యూ పార్ట్‌నర్‌తో న్యూ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నాను’ అంటూ భర్త క్లిక్ చేసిన ఫొటోలను షేర్ చేసింది. కాగా దియా.. నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’లో కీలకపాత్రలో కనిపించనుండగా ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.


Next Story

Most Viewed