స్నేహితులతో ధోనీ లంచ్.. వైరల్‌గా మారిన ఫొటో

by  |
ms dhoni
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా.. ఇంకా వార్తల్లో నానుతూనే ఉంటాడు. కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం అయిన ధోనీ.. ప్రస్తుతం కుటుంబంతో కలసి గడుపుతున్నాడు. ఇటీవలే సిమ్లా పర్యటనకు కుటుంబంతో వెళ్లొచ్చిన ధోనీ ప్రస్తుతం రాంచీలోని ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు. తాజాగా రాంచీలో తన స్నేహితులతో కలసి లంచ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధోనీ ఫామ్ హౌస్‌లోని గారేజ్‌లో ఉన్న బల్లపైనే భోజనం పెట్టుకొని తింటున్నారు. వారి వెనుక ఒక పాత రోల్స్ రాయిస్ కారును ఒక వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. నెరిసిన గడ్డంతో నవ్వుతూ ధోనీ ఉన్న ఫొటోలో అతడు సాధారణ వ్యక్తిలా భోజనం చేయడం ఆయన అభిమానులను ఆకట్టుకున్నది. ధోనీ సింప్లిసిటీకి నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed