మేము ప్రిపేర్ కాలేదు: ధోని

by  |
మేము ప్రిపేర్ కాలేదు: ధోని
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL) 13వ సీజన్ తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. చెన్నై జట్టు అత్యంత దారుణంగా రాజస్థాన్‌పై ఓడిపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనిపై సీఎస్కే జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించాడు. ‘మేము మ్యాచ్ కోసం సరిగా సన్నద్దం అవలేదని తెలిసింది. మొదటి మ్యాచ్‌లో చూపించిన శ్రద్ద ఈ మ్యాచ్‌లో చూపించలేక పోయాము. రాజస్థాన్ జట్టులో కూడా సంజు శాంసన్, స్మిత్ బాగా ఆడారు’ అని ధోని ప్రశంసించాడు.


Next Story

Most Viewed