పూణేలో ఇల్లు కొన్న ధోని

by  |
పూణేలో ఇల్లు కొన్న ధోని
X

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమ్ ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. ధోనీకి దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయి. రాంచీలో ఒక పెద్ద బంగ్లా ఉండగా.. ముంబైలో కూడా కొత్తగా ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. తాజాగా పూణే సమీపంలో ది ఎస్టాడో ప్రెసిడెన్షియల్ సొసైటీలో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం రాంచీలో ఉన్న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి గత ఏడాది రిటైర్ అయ్యాడు. అతడికి వ్యవసాయంతో పాటు క్రీడా సంబంధిత వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధిగా కొనసాగుతున్నాడు. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ రెండో ఫేజ్‌లో ధోనీ పాల్గొనాల్సి ఉన్నది.

Next Story