పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాం.. రోడ్డుపై గ్రామస్తుల ధర్నా

by  |
పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాం.. రోడ్డుపై గ్రామస్తుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడ ఇప్పటికే ఓటుకు ఇంతా అని ఓటర్లకు డబ్బులు ముట్టజెబుతున్న విషయం తెలిసిందే. ఇక ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే.. నోటు ఇస్తేనే ఓటు అని ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి ప్రజలు డిసైడ్ అయ్యారు. వారికి నోట్లు అందకపోవడంతో ఓటు వేయబోమంటూ కూర్చున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో స్థానిక నేతలు ధర్నా చేస్తున్న ఓటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు వీణవంక మండలం గంగారం గ్రామంలో ఓట్లకు పైసలు మాకు ఇవ్వలేదని మహిళలు ధర్నాకు దిగారు. ఆరు వేలు ఇస్తే అందరికీ ఇవ్వాలి కానీ.. కొందరికి మాత్రమే ఎందుకిచ్చారంటూ వారు స్థానిక నేతలను నిలదీశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడారు.

ఏ ఊరురా నీది.. TRS నేతలను ఉరికిచ్చి కొట్టిన బీజేపీ కార్యకర్తలు (వీడియో)

Next Story

Most Viewed