సీఎం మా పార్టీ చెప్పుతో సమానం: అర్వింద్

by  |
సీఎం మా పార్టీ చెప్పుతో సమానం: అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీఎం కేసీఆర్ బీజేపీ ఎడమకాలి చెప్పుతో సమానమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. టీఆర్ఎస్‌ను భూస్థాపితం చేసి, కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. పైకి మాత్రం టీఆర్ఎస్‌తో బీజేపీ ఒప్పందం చేసుకుని పనిచేస్తోందని కొందరు నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేట్టన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కేసీఆర్ ఏజెంట్లేనని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed