ఇద్దరు హీరోయిన్లతో ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్

by  |
Dhanush, D44
X

దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్ పాండమిక్ టైమ్‌లోనూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. ‘కర్ణన్, జగమే తంత్రం’ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ అందుకున్న హీరో.. త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘మారన్’ చేయబోతున్నాడు. ఈ క్రమంలో ధనుష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ (#D44) కూడా ప్రకటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకులు కాగా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ధనుష్ అందిస్తుండటం విశేషం. లెజెండరీ డైరెక్టర్ అండ్ యాక్టర్ భారతీరాజా కీ రోల్ ప్లే చేస్తున్న సినిమాలో ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నిత్యామీనన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా ఫైనల్ కాగా.. అఫిషియల్‌గా వెల్‌కమ్ చెప్పారు మేకర్స్. కాగా ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అత్రంగి రే’ పూర్తి చేయడంతో పాటు మరో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed