లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాం : డీజీపీ

by  |
లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాం : డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ అమలు తీరుపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషదాల బ్లాక్ మార్క్‌ట్‌పై 150 కేసులు నమోదు చేశామని అన్నారు. ఏప్రిల్ 1st నుంచి మే 30 వరకు 7.49 లక్షల మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ.35.81 కోట్ల జరిమానా విధించామని వెల్లడించారు. భౌతికదూరం పాటించనందుకు 41,872 కేసులు, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 2.61 లక్షల మందిపై కేసులు నమోదు చేసి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed