24 గంటలు డ్యూటీలో ఉండాలి : డీజీపీ

by  |
24 గంటలు డ్యూటీలో ఉండాలి : డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సంరద్భంగా పోలీసులందరూ 24 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రమాదం జరుగకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వెల్లడించారు.



Next Story

Most Viewed