రాజు ఆత్మహత్యపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

by  |
DGP-Mahender-Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్యపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజు ఆత్మహత్యపై అనవసర రాద్ధాంతాలు వద్దని, ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలని పేర్కొన్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనడానికి ఏడుగురు సాక్షులున్నారని, అందులో ఇద్దరు ట్రైన్ డ్రైవర్లు, ముగ్గురు రైతులు, ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు ఉన్నట్టు ఆయన తెలిపారు.

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ డ్రైవర్లు ఇద్దరు ప్రత్యక్ష సాక్ష్యులని, ఆత్మహత్యపై ఘన్‌పూర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అధికారులకు సమాచారం అందిచినట్టు ఆయన వివరించారు. సాక్ష్యులు తెలిపిన సమాచారాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు డీజీపీ చెప్పారు.


Next Story

Most Viewed